బాక్సాఫీస్ వద్ద విజేతెవరో?
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార, తాప్సీ ఒకేరోజున బాక్సాఫీస్ వద్దన పోటీ పడబోతున్నారు. ఒకప్పుడు 'ఆరంభం' సినిమాలో నయనతార, తాప్సీ కలిసి నటించారు. కానీ ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు సినిమాలతో పోటీ పడబోతున్నారు. వివరాల్లోకెళ్తే.. నయనతార లీడ్ రోల్లో చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కొలైయుదిర్ కాలమ్' సినిమా జూన్ 14న విడుదల కానుంది.
అలాగే తాప్సీ లీడ్రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గేమ్ ఓవర్' సినిమా కూడా జూన్ 14నే విడుదల కానుంది. ఒకేరోజున పోటీ పడనున్న వీరిద్దరిలో ఎవరు విజేతో తెలియాలంటే జూన్ 14 వరకు వేచి చూడాల్సిందే. ఆసక్తికరమైన విషయమేమంటే.. నయనతారతో మయూరి సినిమాను డైరెక్ట్ చేసిన అశ్విన్ శరవణన్.. ఇప్పుడు తాప్సీ `గేమ్ ఓవర్`కు దర్శకుడిగా వ్యవహరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.