close
Choose your channels

జయనన్ ఎందుకెళ్ళారు?

Tuesday, September 15, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సర్దార్ గురించి చిన్న విషయం బయటికి వచ్చినా అది టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. గబ్బర్ సింగ్ అయిన హిట్ అలాంటిది మరి. బాక్సాఫీసును షేక్ చేసిన గబ్బర్ సింగ్ కు సీక్వెల్ వస్తోందని అనగానే అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఆ సీక్వెల్ కు సర్దార్ గబ్బర్ సింగ్ అని పేరు పెట్టారు. ముందు ఈ సినిమాకు సంపత్ నందిని దర్శకుడిగా అనుకున్నారు.

కానీ స్క్రిప్ట్ విషయంలో పొసగక పోవడంతో సంపత్ నంది తప్పుకున్నారు. బాబీ ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అలాగే ముందుగా వినిపించిన అనీషా ఆంబ్రోస్ ను కాజల్ రీప్లేస్ చేసింది. తాజాగా కెమెరామేన్ను రీప్లేస్ చేయడానికి ఎవరున్నారా? అని ఈ టీమ్ వెతుకుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ కు జయనన్ విన్సెంట్ కెమెరామేన్ గా ఇన్నాళ్ళూ వ్యవహరించారు. ఆయనకూ బాబీకి పడటం లేదని ముందు పుకార్లు వినిపించాయి.

పవన్ కల్యాణ్ తోనూ జయనన్ కు సరిపోవడం లేదనే వార్తలు వినిపించాయి. ఎవరితో విభేదాలో ఏమోగానీ జయనన్ మాత్రం ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు జయనన్ అనారోగ్యం కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి తప్పకున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. జయనన్ స్థానానికి ఆర్థర్ విల్సన్ పేరు బలంగా వినిపిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.