close
Choose your channels

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఎఫైర్'

Friday, September 25, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న తాజా చిత్రం "ఎఫైర్". ఇద్దరు అమ్మాయిల ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతాంజలి, ప్రశాంతి కీలకపాత్రలు పోషించారు. శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొంది.

ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "బాలీవుడ్ లో మహేష్ భట్ రూపొందించే చిత్రాల కోవలో తెరక్కిన చిత్రం "ఎఫైర్". అసభ్యతకు తావు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ విధంగా మా దర్శకుడు శ్రీరాజన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మా "ఎఫైర్" చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీరాజన్ మాట్లాడుతూ... "ప్రేమకు హద్దు లేదు అని షేక్ స్పియర్ చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. గీతాంజలి-ప్రశాంతిల నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా నిర్మాత రామసత్యనారయణగారు అందించిన సహకారంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.