జనసేనలోకి ఆకుల.. ఎక్కడ్నుంచైనా పోటీకీ ‘సై’
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆకుల దంపతులు పార్టీలో చేరారు. దంపతులిద్దరికీ కండువా కప్పి పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆకులతో పాటు పలువురు ఆయన అనుచరులు, ద్వితియ శ్రేణి నాయకులు జనసేన కండువా కప్పుకున్నారు.
పోటీకీ ‘సై’..
రెండ్రోజుల క్రితమే ఎమ్మెల్యే పదవికి, సభ్యత్వానికి ఆకుల రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ.. పవన్ ఎక్కడ్నుంచి పోటీచేయమన్నా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయమన్నా మారుమాట చెప్పనన్నారు. ఏపీలో రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారనే గట్టి నమ్మకం తనకు ఉందని ఆకుల మరోసారి చెప్పుకొచ్చారు.
పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని ఆకుల అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. కాగా.. ఆకుల దంపతుల్లో రాజమండ్రి అసెంబ్లీ నుంచి ఒకరు.. మరొకరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. పార్టీ పెట్టినప్పట్నుంచి ఆకుల సతీమణి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే ఆకుల కూడా జనసేన కండువా కప్పుకోవడంతో పార్టీకి బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
భారీ ర్యాలీగా..
సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నుంచి అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా ఆకుల విజయవాడకు వెళ్లారు. అంతకుముందు తన పార్టీ కార్యాలయంలోని ఉన్న బీజేపీ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఆ బీజేపీ ఫ్లెక్సీ స్థానంలో పవన్, ఎమ్మెల్యే ఆకుల ఉన్న బ్యానర్ సిద్ధం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.