close
Choose your channels

విరాటపర్వంలో 'అల వైకుంఠపురములో' నటి.. అందాల భామ నక్సలైట్ గా..

Saturday, July 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. నక్సలిజం బ్యాడ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.

కథలో నక్సలిజం ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. సాయి పల్లవి, రానా మధ్య సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ చిత్రంలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి, నందిత దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

అందాల భామ నివేద పేతురాజ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరవనుంది. స్వయంగా నివేదా పేతురాజ్ ఈ విషయాన్ని ప్రకటించింది. తనది గెస్ట్ రోల్ అయినప్పటికీ చాలా కీలకమైన పాత్ర అని నివేదా తెలిపింది. నక్సలైట్ రోల్ లో కనిపించబోతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తన పాత్ర షూటింగ్ పూర్తయిందని నివేదా పేతురాజ్ తెలిపింది. కేవలం మూడు రోజుల్లోనే షూటింగ్ ముగిసింది.

కానీ ఆ మూడు రోజుల పాటు చాలా ఎఫోర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. నటన పరంగా ఇది చాలా టఫ్ చిత్రం. నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ లో నటించా. వర్షం పడుతున్నప్పటికీ మేము యాక్షన్ సన్నివేశాల్లో నటించాం. ఇది నాకు అద్భుతమైన ఏపీరియన్స్ అని నివేదా పేర్కొంది.

ఇక నివేదా తన గురించి మాట్లాడుతూ.. నటన పరంగా నేను ఎవ్వరితోనూ పోల్చుకోను. నాకు నేను యూనిక్ గా ఫీల్ అవుతాను అని తెలిపింది. ఇక తనకు సాహసోపేతమైన ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం అని నివేదా పేర్కొంది. 2015లో తాను నేపాల్ లోని అన్నపూర్ణ బేస్ కు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లినట్లు నివేద తెలిపింది. తీవ్రమైన చలిలో ఎందుకు వెళుతున్నావు అని చాలా మంది అడిగారు.

అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ఒంటి నొప్పులు ఉన్నప్పటికీ తాను తన జర్నీ పూర్తి చేసినట్లు నివేద తెలిపింది. నివేద పేతురాజ్ తెలుగులో చిత్రలహరి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.