close
Choose your channels

త్రివిక్రమ్, బన్నీల మధ్య చర్చోపచర్చలు.. ఏం తేలుస్తారో?

Thursday, December 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రివిక్రమ్, బన్నీల మధ్య చర్చోపచర్చలు.. ఏం తేలుస్తారో?

అల్లువారబ్బాయి అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 12న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ .. హీరో, డైరెక్టర్‌ల మధ్య తీవ్ర చర్చకు దారి తీసిందట. ఎడిటింగ్ అనంతరం.. ఫైనల్ రష్ చూసి.. రన్ టైమ్ 3.05 గంటలని త్రివిక్రమ్ చెప్పారట. అయితే ఇంత ఎక్కువ నిడివి వద్దని బన్నీ పట్టుబడుతున్నాడట. తను రాసుకున్న పంచ్ డైలాగులతో , కామెడీ ట్రాక్‌తో సినిమా బాగా వచ్చిందని.. ఏదీ తీసేయడానికి కుదరడం లేదని త్రివిక్రమ్ చెబుతున్నారట. అయితే అల్లు అర్జున్‌కు తుది నిర్ణయాన్ని అప్పగించారని సమాచారం. మరి బన్నీ ఏం చేస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జ‌యరాం, టటు, సుశాంత్‌, నివేదా పేతురాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 28న హైద‌రాబాద్‌లో, జ‌న‌వ‌రి 5న వైజాగ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.