close
Choose your channels

మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

Tuesday, March 27, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రికొంత ఆలస్యం కానున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. 20 శాతం టాకీ పార్టు, మూడు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తిచేసుకుంది. మే 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల తెర‌కెక్కిస్తున్న‌ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.

అయితే.. ఈపాటికే తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించాల్సి ఉండగా.. అది మరికొంత ఆలస్యం అయ్యేట్టుగా ఉంది. చిత్రీకరణకు కావాల్సిన కొన్ని ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడంతో.. వీసా వ్య‌వ‌హారాల్లో జాప్యం జరుగుతోంద‌ని తెలిసింది. ఈలోగా.. రవితేజ కూడా ‘నేల టిక్కెట్టు’ చిత్రాన్ని పూర్తిచేసాకే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ రెండో వారంలో రవితేజ, కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ షూటింగ్ నిమిత్తం అమెరికాకు పయనమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.