close
Choose your channels

నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

Saturday, May 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నువ్ ఎవడివి నన్ను అడగడానికి.. అనసూయ ఆగ్రహం!

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్ కిట్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆమె భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ.. గ‌ర్భిణుల‌కు న్యూటిష‌న్ కిట్లను అంద‌జేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందానిచ్చింద‌ని.. ప్రస్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌ర్ధవంతమైన పోష‌కాలు అందించ‌డానికి వారిలో ధైర్యాన్ని నింప‌డానికి తాను ఈ పనిచేస్తున్నట్లు తెలిపింది. మంచి పనిచేసిన అన‌సూయ‌ను రాచ‌కొండ పోలీసులు అభినందించారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఈ కార్యక్రమం అనంతరం అభిమానులతో అను ముచ్చటించింది.

ఇదీ అసలు సంగతి..!

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్ చాట్ చేసిన ఈ భామకు ఊహించని ప్రశ్న.. ఎదురైంది. దీంతో పుట్టినరోజున మొత్తం మూడాఫ్ అయ్యింది. ఈ సందర్భంగా ఇంట్లో తనకు సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుని చిట్ చేసిన అనసూయకు ఓ నెటిజన్ విచిత్ర ప్రశ్న వేశాడు. ‘ఇద్దరు పిల్లల తల్లివి.. ఇలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి..?’ అని ప్రశ్నించాడు. దీంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఈ ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ఎలాంటి బట్టలు వేసుకుంటే నీకేంటి.. నువ్వు ఎవడికి నన్ను అడగడానికి..’ అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. ఇలా చాలా మందే చిత్ర విచిత్రాలుగా ప్రశ్నలేశారు. కాగా ఇలాంటి ఘటనలు అనసూయకు ఎదురవ్వడం ఇదేం మొదటి సారి కాదు. సోషల్ మీడియా వేదికగా ఈ హాట్ యాంకర్‌పై చాలా సార్లే వివాదం రేగింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.