close
Choose your channels

జగనన్న విద్యాదీవెన... విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన జగన్

Wednesday, March 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘జగనన్న విద్యాదీవెన’ పథకం నగదును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. తల్లుల ఖాతాల్లో జమచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందన్నారు. చదువులకు పేదరికం అడ్డు కాకూడదని.... చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. విద్య మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. అర్హులైన అందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. గత ప్రభుత్వంలోని బకాయిలు రూ.1,778 కోట్లు కూడా చెల్లిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2021 అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ప్రభుత్వం రూ.10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లు జమ చేసినట్లు జగన్‌ తెలిపారు. ఈ పథకం కింద విద్యా సంవత్సరంలో మూణ్నెళ్లు పూర్తయిన వెంటనే ఆ కాలానికి సంబంధించిన బోధనా రుసుముల్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు సీఎం గుర్తుచేశారు. ఏపీలో ప్రైవేట్‌ బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని సీఎం జగన్‌ తెలిపారు. నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పారు. ఒక గ్రామం నుంచి ఒకరు డాక్టరు అయితే కుటుంబం మాత్రమే కాదు, ఊరు కూడా బాగుపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యాదీవెన, వసతి దీవెనల కోసం మన ప్రభుత్వం అక్షరాల రూ.9,274 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని... తల్లులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశామని జగన్ పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.