close
Choose your channels

పూరి కోసం బాల‌య్య ముహుర్తం...

Wednesday, October 11, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'మెహ‌బూబా'. ఈ సినిమాలో పూరి జ‌గ‌న్నాథ్ త‌నయుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్నారు. ఈరోజు ఉద‌యం 8.20 నిమిషాల‌కు సినిమాను హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్రారంభించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాకు ముహుర్తాన్ని ఖ‌రారు చేసిందెవ‌రో కాదు..సాక్షాత్ నంద‌మూరి బాల‌కృష్ణ కావ‌డం గ‌మ‌నార్హం.

బాల‌కృష్ణ 101వ చిత్రం 'పైసావ‌సూల్‌' సినిమాను పూరి డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు బాల‌కృష్ణ‌తో ఎర్ప‌డిన సానిహిత్యం కార‌ణంగా బాల‌య్య ఈ సినిమాకు ముహుర్తాన్ని నిర్ణ‌యించార‌ట‌. నేహ‌శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 1971లో భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. సందీప్ చౌతా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.