close
Choose your channels

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే వ్యాక్సిన్‌ను అందిస్తాం: భారత్ బయోటెక్

Tuesday, August 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. నేడు మంత్రి కేటీఆర్ భారత్ బయోటెక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌పై జినోమ్ వ్యాలీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ‘వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్, అత్యవసరం - సమతుల్యత’ అనే అంశంపై నిపుణులతో కేటీఆర్ చర్చించారు.

ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. కొత్త వైరస్ కావడం వల్ల తమకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని.. అన్నింటినీ అధిగమిస్తూ ఎంతో నైపుణ్యం సాధించామన్నారు. డబ్ల్యూహెచ్‌వోతో పాటు అమెరికా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు. తాము మార్కెట్‌లో పోటీదారులం అయినప్పటికీ.. కరోనాపై విజయం కోసం పోరాడుతున్నామని కృష్ణ ఎల్లా తెలిపారు. కాబట్టి వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తామన్నారు. ప్రపంచం మొత్తానికి నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందజేస్తామని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. అయితే ప్రతి చిన్న అనుమతి కోసం ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని.. అవసరమైన అనుమతులు ప్రాంతీయ కేంద్రం నుంచే ఇవ్వాలని కోరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.