close
Choose your channels

బిగ్ బాస్-3 ఫినాలేలో నాగ్ కంటే చిరునే హైలేట్!

Monday, November 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్ బాస్-3 ఫినాలేలో నాగ్ కంటే చిరునే హైలేట్!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్.. జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమై నవంబర్-03తో ముగిసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ అంటే విన్నర్‌ ఎవరో ప్రకటించే రోజు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వడంతో లెక్కలు మారిపోయాయి. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున షో హైలైట్‌గా నిలవగా.. చిరు ఎంట్రీతో అందరి చూపూ ఆయనపైనే పడింది. ఎంతో హుందాగా వేదికపై అడుగుపెట్టిన చిరు బిగ్ బాస్ షో గురించి చెబుతుంటే నాగ్, బిగ్‌బాస్ ప్రియులు ఒకింత ఆశ్చర్య చకితులయ్యారు. మాటలే కాదు చిరు తనదైన శైలిలో కామెడీ కూడా పండించారు!

చిరు మాటల్లోనే...
 
‘ఎప్పుడూ కోపగించుకోని నాగ్ బిగ్ బాస్-3 సందర్భంగా కోపం తెచ్చుకుంటున్నాడని విన్నాను. కోపం కూకట్ పల్లిలో ఉంటే నాగార్జున నార్కెట్ పల్లిలో ఉంటారు’ అని చిరు చెప్పుకొచ్చారు. అనంతరం ఒక్కో కంటెస్టెంట్ గురించి చిరు మాట్లాడారు. అయితే.. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి గురించి మాట్లాడిన చిరు బాగా ఎమోషనల్ అయ్యారు. ‘ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు. ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు’ (చిరు మాట్లాడుతుండగా.. తమన్నా కన్నీళ్లు ఆపులేకపోయింది). ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు.. ఐ అప్రిషియేట్ యూ’ అని తమన్నాను చిరు అభినందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే చిరు ఎంట్రీతో షోకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చింది.. ఆయన మాటలు, ఎమోషనల్‌తో షోలో హైలైట్‌గా నిలిచారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.