కృష్ణ.. కృష్ణా.. సీతతో పోలికేంటి స్వామీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సోదరి షర్మిళ.. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు గుర్రుమంటుండగా.. వైసీపీ నేతలు, పలువురు ప్రముఖులు షర్మిళకు మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ మరో అడుగు ముందుకేసి వైఎస్ షర్మిళను సీతతో పోల్చారు. షర్మిళను 'కలియుగ సీత'తో.. ఆమెపై దుష్ప్రచారం చేస్తున్న వారిని దగుల్బాజీ, గజ్జి కుక్కలతో పోల్చారాయన. ఆడపడుచుకు అన్నగా.. మద్దతిచ్చి అండగా నిలవడంలో ఎలాంటి తప్పులేదు.. మద్దతివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మధ్యలో ‘కలియుగ సీత’ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడటంతో నెట్టింట్లో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.
టీడీపీకి ఓటమి భయం.. వైసీపీ విజయం ఖాయం!
"ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం వైసీపీ అధినేత వైఎస్ జగన్ 'ప్రజా సంకల్పయాత్ర' గురించే మాట్లాడుతోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానిదే. వైఎస్ షర్మిలపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా?. ఆడపడుచుపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాను. జగన్ను రాజకీయంగా ఎదుర్కొలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీలో పరిపాలన అన్నదే లేదు.. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులో లేరు" అని చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.