close
Choose your channels

సెన్సార్ కి వెళ్తున్న ధనలక్ష్మి

Thursday, July 9, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో భీమవరం టాకీస్‌ పతాకంపై.. యువ ప్రతిభాశాలి సాయి అచ్యుత్‌ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ధనలక్ష్మి తలుపు తడితే`. ధనరాజ్, మనోజ్ నందం, విజయ్ సాయి, రణధీర్, అనిల్ కళ్యాణ్, శ్రీముఖి, నాగబాబు, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. సెన్సార్ కు సిద్ధమైంది.

బోలే శావలి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఈ సందర్భంగా ...

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... "కథ-కథనాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం "ధనలక్ష్మి తలుపు తడితే". పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెన్సార్ పూర్తవ్వగానే చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామన్నది తెలియజేస్తాం" అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.