close
Choose your channels

పేలుళ్ల నుంచి క్షేమంగా బయటపడ్డ హీరోయిన్ సోదరుడు

Sunday, April 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పేలుళ్ల నుంచి క్షేమంగా బయటపడ్డ హీరోయిన్ సోదరుడు

శ్రీలంకలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 160 మందికి పైగా ఘటనాస్థలిలోనే కన్నుమూయగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. పేలుళ్లతో అలెర్టయిన మరికొందరు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీసి క్షేమంగా బయటపడ్డారు. ఇదిలా ఉంటే గంట గంటకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు సమాచారం. 

సంజన సోదరుడు సేఫ్!

వివరాల్లోకెళితే.. టాలీవుడ్‌ హీరోయిన్ సంజన సోదరుడు రాహుల్ శెట్టి ఈ పేలుళ్లు జరిగినప్పుడు కొలంబోలో ఉన్నాడు. అయితే విషయం తెలుసుకున్న సంజన.. సోదరుడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంది. తాను ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన చెప్పడంతో సంజన కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. దేవుడి దయవల్ల మా సోదరుడు రాహుల్ క్షేమంగా బయటపడ్డాడని సంజన మీడియాకు సమాచారం అందించింది. ఇలా పేలుళ్లు జరగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఆ దేవుడే సరైన శిక్ష విధిస్తాడన్నది. కాగా.. ఈ ప్రమాదం జరిగినప్పుడు రాహుల్ సెయింట్‌ ఆంటోనీ ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.