పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేశ్, వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం మహేశ్ తన 25వ చిత్రం మహర్షి చిత్రీకరణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా పూర్తి కాగానే అంటే దాదాపు వచ్చే ఏడాది మార్చిలో సుకుమార్ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 2014లో మహేశ్, సకుమార్ కాంబినేషన్లో 'నేనొక్కడినే' సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.
మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. 'రంగస్థలం' వంటి సక్సెస్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.