సెన్సార్ బోర్డు భయపడిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ, రాకేష్ రెడ్డి, దీప్తి బాలగారి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వాటి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
అయితే ఈ సినిమా తెలుగు దేశం పార్టీపై ప్రభావం చూపుతుంది కాబట్టి.. ఎన్నికలు అయ్యే వరకు ఈ సినిమాను విడుదల చేయకూడదని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. దీంతో వర్మ ... అసలు సినిమాను ఆపే హక్కు సెన్సార్ బోర్డుకు ఎక్కడుంది .. నేను కోర్టులో తేల్చుకుంటాను అంటూ సోషల్ మీడియాలో సెన్సార్ బోర్డును దయ్యబట్టాడు.
రేపు మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తానంటూ ప్రెస్మీట్ను అనౌన్స్ చేశాడు. దీంతో.. సెన్సార్ బోర్డు భయపడిందా? లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుందేమో కానీ.. తాము ఈ వారంలోనే సినిమాను చూస్తామని.. అయితే క్యూలో కొన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటిని చూసిన తర్వాత 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను చూస్తామని తెలిపింది. దీంతో కూల్ అయిన వర్మ.. తనకు సిబిఎఫ్సి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్)తో వచ్చిన మనస్పర్ధలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ గొడవ మరెన్ని మలుపులు తీసుకుంటుందో చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.