close
Choose your channels

దుబాయ్‌లో 'జై సింహా'

Monday, November 27, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి.కె.ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న‌ ఈ సినిమాకి చిరంత‌న్ భ‌ట్ సంగీత‌మందిస్తున్నారు. కాగా, ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ ని దుబాయ్‌లో ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్‌లో భాగంగా.. డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దుబాయ్ లో రెండు సాంగ్స్‌ని షూట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందులో ఒక పాట‌ను బాలకృష్ణ, నయనతార పై.. రెండో పాట‌ను బాలకృష్ణ, నటాషా దోషిపై పిక్చ‌రైజ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.

డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఈ సినిమా ఆడియోని విడుద‌ల చేయ‌నున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం త‌రువాత బాల‌య్య‌, న‌య‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.