నిర్మాతగా కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిర్మాతగా మారనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. పుష్కర కాలానికి పైగా హీరో్యిన్గా మెప్పించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సినీ జర్నీలో మరో కోణంలో అడుగుపెట్టనుంది. కె.ఎ వెంచర్స్ అనే సంస్థను స్థాపించి అందులో లో బడ్జెట్ చిత్రాలు నిర్మించి కొత్త టాలెంట్ను, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఎంకరేజ్ చేయాలనుకుంటుందట. అందులో భాగంగా `అ!` ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. బాలీవుడ్ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేశారు.
అందులో తమిళంలో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్. `పారిస్ పారిస్` పేరుతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాను యూరప్లో కూడా చిత్రీకరించారు. ఆ సమయంలో అక్కడ ప్రశాంత్ వర్మ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో సినిమా చేయడానికి కాజల్ సరేనందట. అదీగాక ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన `అ!` సినిమాలో కాజల్ ఓ కీలక పాత్రధారిగా నటించన సంగతి తెలిసిందే. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను గురించి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.