close
Choose your channels

బైడెన్ ఏడాదికి మించి బతకరంటూ కంగన సంచలన వ్యాఖ్యలు

Monday, November 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బైడెన్ ఏడాదికి మించి బతకరంటూ కంగన సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ ఒక గజిని అని.. ఆయన ఏడాదికి మించి బతకరని ఆమె వ్యాఖ్యానించారు. ఆ తరువాత మొత్తం బాధ్యతలు చూసుకునేది కమలా హ్యారిసేనని కంగన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కంగన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ప్రతి ఐదు నిమిషాలకు డేటా క్రాష్ అయిపోయే గజినీ జో బైడెన్.. ఆయనకు ఎక్కించిన మందులతో ఏడాదికి మించి బతుకుతారని అనుకోవడం లేదు. ఆ తరువాత కమలా హారిసే షో రన్ చేస్తారు. ఒక మహిళ ఎదిగితే.. మరింత మంది మహిళలు ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది. ఈ హిస్టారిక్ డేకి చీర్స్’’ అంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. కాగా.. జో బైడెన్ అధ్యక్షుడు కావడంతో ఇక కమలా హారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. కమలా హ్యారిస్ అమెరికాకు 49వ ఉపాధక్షురాలిగా ఎన్నిక కానున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.