close
Choose your channels

సంప‌త్‌నంది క‌థ స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో కె.కె.రాధామోహ‌న్ కొత్త చిత్రం

Monday, August 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీని ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంబించారు. ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ ``మా బ్యాన‌ర్‌లో ఏమైంది ఈవేళ‌, బెంగాల్‌టైగ‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందించిన ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా అనిపించింది. క‌థ బాగా న‌చ్చ‌డంతో ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌డం జ‌రిగింది.

సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్‌వీక్ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జ‌రుగుతుంది. సంప‌త్‌నంది అసోసియేట్ డైరెక్ట‌ర్ అశోక్ తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబందించి ప్ర‌ముఖ న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతుంది. అనూప్ క్రియేటివ్స్ సంగీతం అందిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ప‌్ర‌వీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్‌‌, స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్‌, నిర్మాత‌: కె.కె. రాధామోహ‌న్‌, క‌థ, స్క్రీన్ ప్లే, మాట‌లు: స‌ంప‌త్‌నంది, ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.