close
Choose your channels

వీర జవాన్ల కుటుంబాలకు 'మా' వంతు సాయం

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వీర జవాన్ల కుటుంబాలకు మా వంతు సాయం

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారతదేశంలోని పలువురు ప్రముఖలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, పౌరులు, హీరోలు పెద్ద మనసుతో తమవంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముందుకొచ్చింది. 'మా' వంతుగా రూ. 5లక్షల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.

విరాళం ప్రకటించిన అనంతరం 'మా' పెద్దలు మీడియాతో మాట్లాడుతూ.."జవాన్ల త్యాగం మరువలేనిది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి" అని మా అధ్యక్షుడు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వి. కె నరేష్ తెలిపారు. కాగా.. ఉగ్రమూకల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ పరిశ్రమ నుంచి ముందుకొచ్చి సాయం ప్రకటించిన విషయం విదితమే. కాగా ఈ దాడి జరిగిన మరోక్షణమే పాక్‌‌పై పలువురు నటీనటుమణులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల కుటుంబాలకు అన్ని విధాలా తాము అండగా ఉంటామని ధైర్యం చెబుతూ విరాళాలు ప్రకటించారు. 

కాగా.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది కారు బాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఉగ్రదాడిలో కేవలం ఒక వ్యక్తి(ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది) కారణంగా ఇంత భారీ మొత్తంలో జవాన్లు మరణించడం ఇదే తొలిసారి. జవాన్లపై దాడి విషయం తెలిసి యావత్తు భారతావని కన్నీరు పెడుతోంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే సర్జికల్ స్ట్రైక్స్-2 జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.