సభలో నడుస్తూ కింద పడ్డ ఎంపీ కవిత!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నోవాటెల్ వేదికగా ‘జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సభకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు, దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధేయమార్గంలో సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు పేరుతో నిర్వహిస్తున్న సదస్సును సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే.. టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కలిసి ప్రారంభించారు.
కిందపడ్డ కవిత..!
ఈ సందర్భంగా వేదికపైకి వెళ్లడానికి నడుచుకుంటూ వెళ్తున్న కవిత ఒక్కసారిగా కిందపడిపోయారు.! కవిత కిందపడటంతో ఒక్కసారిగా సభలో ఉన్న వాళ్లంతా అసలేం జరిగింది..? ఎందుకు పడిపోయారు? అంటూ ఆమె చుట్టుముట్టారు. పక్కనే ఉన్న ఆమె పీఏ, మరో వ్యక్తి ఆమెను తిన్నగా పైకి లేపారు.!. అయితే ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా..? లేదా అనే విషయం తెలియరాలేదు. సభ నుంచి బయటికెళ్లిన కవిత ఫ్రెషప్ అయ్యి పదినిమిషాల అనంతరం యథావిథిగా సదస్సులో ప్రసంగించారు.! ప్రస్తుతం కవిత కిందపడ్డ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.!.
పూర్ణను అభినందించిన కవిత..
ఈ సదస్సులో పూర్ణను కవిత ప్రత్యేకంగా అభినందించారు. తన విజయంతో నిజామాబాద్ జిల్లాను ప్రపంచానికి పరిచయం చేసిందని పూర్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ దీవించారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా సామాజికరంగంలో విశేష సేవలందించిన ఎనిమిది మందికి తెలంగాణ జాగృతి ఇండియా యూత్ ఫెలోషిప్ ప్రదానం చేశారు. అనంతరం ఒకరిద్దరి ప్రసంగంతో రెండో రోజు సదస్సు ముగిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.