‘మై ఛానల్’లో తెలుగు ఛానెల్స్ను ఏకిపారేసిన నాగబాబు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు ‘తమ్ముడు’ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తుంటే.. ఇటు ‘అన్నయ్య’ నాగబాబు ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ యూ ట్యూబ్ చానెల్లో జోరు పెంచారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలతో కొన్ని మీడియా సంస్థలపై సైతం స్కిట్స్ చేసిన ఆయన తాజాగా.. మరో అదిరిపోయే స్కిట్ చేసి జనసేన అభిమానులు, మెగాభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముకాస్తున్న మీడియాను టార్గెట్ చేస్తూ ఘాటైన పదాలతో డైరెక్ట్ ఎటాక్ చేశారు నాగబాబు.
కాగా.. 11:30 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో నాగబాబు స్వామిజీ అవతారం ఎత్తారు. ఇక అవినీతి మీడియా, నీతి మీడియా అంటూ రెండు పాత్రల ద్వారా మీడియా అధిపతులు, జర్నలిస్ట్లపై పాట రూపంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వీడియోలో ఏముంది..!?
గన్నయ్య, కన్నయ్య పాత్రల ద్వారా.. ఫ్యాన్, సైకిల్ అంటూ అధికార పార్టీలను ఇన్ డైరెక్ట్గా విమర్శించిన ఆయన.. ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలపై దుమ్మెత్తిపోశారు. ఇక ఏబీఎన్ రాధాక్రిష్ణ, రవిప్రకాష్, రజినీకాంత్, సాంబశివరావు ఇలా అందర్నీ.. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అంటూ కూస్తూ విలువలు పాటించకుండా సత్యాన్ని పాతేసి నిత్యమూ వ్యక్తిత్వ హత్యలే చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "గడ్డితిని గుడ్డెద్దులా అడ్డగోలుగ కూస్తే.. నడ్డి విరుగుద్ది" అంటూ జబర్దస్త్ టీంతో కలసి నాగబాబు చేసిన ఈ స్కిట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.