close
Choose your channels

శర్వానంద్ సినిమాపై నితిన్ డౌట్.. అందుకే పక్కన పెట్టేశాడా ?

Monday, June 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శర్వానంద్ సినిమాపై నితిన్ డౌట్.. అందుకే పక్కన పెట్టేశాడా ?

గత ఏడాది నితిన్ భీష్మ చిత్రంతో హిట్ కొట్టాడు. నితిన్ కెరీర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది అనుకుంటున్న తరుణంలో ఈ ఏడాది 'చెక్' తో నితిన్ కి షాక్ తగిలింది. అంతకు ముందు విడుదలైన 'రంగ్ దే' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో కథల ఎంపికలో నితిన్ డిఫెన్స్ లో పడ్డాడు.

ఇదీ చదవండి: చాలా సార్లు ఆ ఆఫర్ రిజెక్ట్ చేశా.. ఫైనల్ డెసిషన్ ఇదే : భూమిక

నమ్మకం కుదిరితేకానీ కొత్త ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పడం లేదు. ఇదిలా ఉండగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే చిత్రంలో నటించాల్సి ఉంది. గత ఏడాదే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని నితిన్ పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ని నితిన్ పక్కన పెట్టడానికి గల కారణం వైరల్ గా మారింది. పవర్ పేట కథ మరో చిత్రాన్ని పోలి ఉందట. ఆ అనుమానంతోనే నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. పవర్ పేట కథని పోలి ఉన్నట్లు నితిన్ కి డౌట్ వచ్చిన మరో చిత్రం.. శర్వానంద్ నటిస్తున్న 'మహాసముద్రం'.

అందుకే మహాసముద్రం చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూస్తే బెటర్ అని నితిన్ కృష్ణ ఛైతన్యకి చెప్పాడట. అప్పుడైతే అవసరమైన మార్పులు చేసుకునే వీలుంటుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుకుంటున్న కీర్తి సురేష్ కూడా ప్రస్తుతం 'సర్కార్ వారి పాట', తమిళంలో మరో చిత్రంతో బిజీగా ఉంది. అది కూడా ఒక కారణం అట.

ప్రస్తుతం నితిన్ నటించిన మాస్ట్రో రిలీజ్ కు రెడీగా ఉంది. దీనిని థియేటర్స్ లో విడుదల చేస్తారా లేక ఓటిటిలోకి తీసుకువస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. మాస్ట్రో తర్వాత వక్కంతం వంశీ దర్శత్వంలో నితిన్ నటించబోతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.