close
Choose your channels

నేను పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు: నిత్యానంద

Saturday, December 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేను పరమశివుడ్ని.. నన్నెవరేం చేయలేరు: నిత్యానంద

స్వయం ప్రకటిత దేవుడు, రేప్‌ కేసులో నిందితుడిగా ఉన్న స్వామి నిత్యానంద కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మాత్రం సముద్రమార్గం ద్వారా అడ్రస్ లేకుండా పోయాడు. ఆయన పరారైన నాటి నుంచి ఇప్పటి వరకూ కొన్ని బృందాలుగా విడిపోయిన పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సొంత దేశం ‘కైలాస’ను ఏర్పాటు చేశారని ఇందుకు సంబంధించి విదివిధానాలతో పాటు పలు విషయాలను వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. అది కూడా భారతదేశంలో కాకుండా ఈక్వెడార్‌లో ఏర్పాటు చేసుకున్నట్లు గత కొన్ని రోజులు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంతవరకూ ఈ ‘దేశం’ వ్యవహారంపై ఆయన స్పందించలేదు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో మాత్రం నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది.

వీడియోలో ఏముంది..!?
‘నేను పరమశివుడిని.. నన్ను ఎవరూ తాకలేరు.. ఏ కోర్టు కూడా నన్ను విచారించలేదు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మూడు ముక్కలే కాదు ఇంకా చాలానే అన్నాడాయన. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో ఎక్కడ్నుంచి అప్‌లోడ్ అయ్యింది.

అబ్బే అంతా ఉత్తుత్తే!
ఇదిలా ఉంటే.. ‘కైలాస’ అనే పేరుతో స్వతంత్ర దేశంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలపై ఢిల్లీలోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం ఇవాళ స్పందించింది. నిత్యానంద తమ దేశానికి వచ్చిన మాట వాస్తమేనని, తనను శరణార్థిగా గుర్తించాలని అభ్యర్థన కూడా పెట్టుకున్నారని తెలిపింది. అయితే తాము ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆయన పొరుగునే ఉన్న హైతీకి వెళ్లిపోయారని వివరణ ఇచ్చింది. అలాగే, తమ దేశం నుంచి నిత్యానంద దీవిని కొనుగోలు చేశారని వస్తున్న వార్తలు నిరాధారమైనవని, దయచేసి మీడియా ఇకనైనా ఈ విషయంలో తమ దేశం పేరు రాయకుండా ఉంటే మంచిదని ఈక్వెడార్ రాయబార కార్యాలయం హితవు పలికింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.