close
Choose your channels

ఎన్టీఆర్ రచయితను డైరెక్టర్ గా మారుస్తున్న...

Tuesday, May 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్ ఈ ఏడాది నాన్నకు ప్రేమతో చిత్రంతో పెద్ద సక్సెస్ నే అందుకున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ డైరెక్టర్ అయిన మెయిన్ పాయింట్ ను హుస్సేన్ షా కిరణ్ అనే రచయిత అందించి, కథ రూపకల్పనలో తన వంతు సాయం అందించాడు. ఈ చిత్రం తర్వాత హుస్సేన్ షా కిరణ్ మీకు మీరే మాకు మేమే అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు. అయితే హుస్సేన్ వర్కింగ్ స్టైల్ నచ్చిన సుకుమార్ తను కొత్తగా స్థాపించిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై హుస్సేన్ కు డైరెక్టర్ గా అవకాశం ఇస్తానని అన్నాడు. అన్నట్లుగానే ఇప్పుడు హుస్సేన్ షా కిరణ్ కు సుకుమార్ తన బ్యానర్ లో అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట. ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తాడని విశ్వసనీయవర్గాల సమాచారం. జ్యో అచ్యుతానంద సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.