close
Choose your channels

ఆనంద సాయి మాతృమూర్తి మరణ వార్త బాధించింది: పవన్

Tuesday, January 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆనంద సాయి మాతృమూర్తి మరణ వార్త బాధించింది: పవన్

ప్రముఖ సినీ కళా దర్శకుడు, యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆనంద సాయికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి భానుమతి(74) హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. భారతి మరణంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఆనంద సాయి గారి మాతృమూర్తి మరణించారని తెలిసి చాలా బాధకు గురయ్యానని పేర్కొంటూ పవన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘‘మిత్రుడు, ప్రముఖ కళా దర్శకుడు, యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ ఆనంద సాయి గారి మాతృమూర్తి శ్రీమతి భారతి గారు మృతి చెందారని తెలిసి చాలా బాధకు లోనయ్యాను. శ్రీమతి భారతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ ఆనందసాయి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.