ఆ పుకార్లు నమ్మొద్దు.. అరవింద్ స్వామిలాగా అయితే ఓకే!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలోనే విలన్గా మారబోతున్నారని.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య చిత్రాల్లో అలా నటిస్తారని గత కొన్ని రోజులు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజశేఖర్ అభిమానులు నిజమేనేమో.. పరిస్థితులు అనుకూలించకపోతే.. విలన్ అయినా తప్పదేమో అని ఫ్యాన్స్ భావించారు.
అయితే హీరో విలన్గా మారడంలో ఎలాంటి తప్పులేదు. రేపొద్దున మళ్లీ యథావిధిగా హీరో అవకాశాలు వస్తే ఎంచక్కా.. అటు ఇటు రెండు బ్యాటింగ్లు చేసుకోవచ్చు అంతే. అలా చేస్తున్న హీరోలు చాలా మందే కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లోనూ ఉన్నారు. రాజశేఖర్ విషయంలో ఈ పుకార్లు ఎవరు పుట్టించారో తెలియదుగానీ.. యాంగ్రీస్టార్ మాత్రం ఇంటర్వ్యూ వేదికగా ఒకింత యాంగ్రీగానే రియాక్ట్ అయ్యారు.
"బాలకృష్ణ, చిరంజీవిల చిత్రాల్లో విలన్గా నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో అర్థంకావడంలేదు. అవన్నీ పుకార్లు మాత్రం.. ఎవరూ నమ్మొద్దు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభిస్తాను. విలన్గా చేయడం పట్ల నాకేమీ అభ్యంతరాలు లేవు. కాకపోతే ‘ధృవ’ చిత్రంలో అరవింద్ స్వామికి లభించినటువంటి క్యారక్టర్ను కోరుకుంటాను. అరవింద సమేత, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు పాత్రలు బాగా నచ్చాయి. అలాంటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తాను. అయితే.. సాధారణ ప్రతినాయక పాత్రలు మాత్రం చేయనుగాక చేయను" అని రాజశేఖర్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా.. రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘కల్కి’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘కల్కి’ ఇంటర్వ్యూలో భాగంగా రాజశేఖర్ పై విషయాలు పంచుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.