close
Choose your channels

రామ్ చరణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్...

Monday, December 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ త‌ర్వాత త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట‌ర్. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా, విల‌న్ గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నారు.అయితే... ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించాల‌నుకున్నారు. కానీ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి యు.ఎస్ వెళ్ల‌డం వ‌ల‌న ఈ సినిమా ప్రారంభం ఆల‌స్యం అయింద‌ట‌. సంక్రాంతి త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి యు.ఎస్ నుంచి వ‌స్తార‌ట‌. ఆత‌ర్వాత పూర్తి స్ర్కిప్ట్ ని చ‌ర‌ణ్ కి నెరేట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 10న ఈ చిత్రాన్ని ఘ‌నంగా ప్రారంభించ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేసార‌ట‌. మ‌రి..రీమేక్ తో నైనా చ‌ర‌ణ్ స‌క్సెస్ సాధిస్తాడో..? లేదో..? చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.