close
Choose your channels

యాక్ష‌న్ ఎపిసోడ్‌కి సిద్ధ‌మైన ర‌వితేజ‌

Monday, September 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెంగాల్ టైగ‌ర్ త‌రువాత రెండేళ్ల గ్యాప్‌తో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ నుంచి వ‌స్తున్న సినిమా రాజా ది గ్రేట్‌. ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని కీల‌క‌మైన ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ని రాయ్‌ఘ‌ర్‌లో చిత్రీక‌రించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ర‌వితేజ త‌దిత‌రులపై తీసే ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఆ సీన్ తీసేందుకు చిత్ర‌యూనిట్ రాయ్‌ఘ‌ర్‌కి బ‌య‌లుదేరింది కూడా. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ్రీన్ హీరోయిన్గా న‌టిస్తున్న ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశి ఖ‌న్నా అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.