close
Choose your channels

అమితాబ్ రాక - వర్మ ర్యాలీ..!

Tuesday, December 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం వంగ‌వీటి. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా వంగ‌వీటి చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించారు. ఈ సంచ‌ల‌న చిత్రం ఈనెల 23న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా శివ టు వంగ‌వీటి ఎ జ‌ర్నీ ఆఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఈరోజు హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెష‌న్ హాల్ లో ఏర్పాటు చేసారు.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా అమితాబ్, నాగార్జున హాజ‌ర‌వుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు అమితాబ్ శంషాబాద్ విమానాశ్ర‌యంకు చేరుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి జెఆర్ సి క‌న్వెష‌న్ హాల్ వ‌ర‌కు అభిమానులు ర్యాలీ ఏర్పాటు చేసారు. ఈ ర్యాలీలో అమితాబ్ తో పాటు వ‌ర్మ టీమ్ పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం జ‌రిగే వంగ‌వీటి సినిమాకి సంబంధించిన ఈ స్పెష‌ల్ ప్రొగ్రామ్ లో టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ & యంగ్ హీరోస్ పాల్గొంటున్నారు. వంగ‌వీటి రిలీజ్ కి ముందే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌...రిలీజ్ త‌ర్వాత ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.