close
Choose your channels

ఆర్జీవీ భావోద్వేగ ట్వీట్.. !

Saturday, February 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్జీవీ భావోద్వేగ ట్వీట్.. !

సంచలనాల దర్శకుడు ఆర్జీవీ .. ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నారు. యథార్థ కథాంశాలతో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ... తెలుగు నాట సంచలనం సృష్టించిన దిశ ఘటనపై సినిమా తీస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించి వరుసపెట్టి ట్వీట్స్ చేసిన ఆయన.. దిశ ఘటన తాలూకా ఫొటోలను అప్‌లోడ్ చేశారు. అంతేగాక భావోద్వేగ ట్వీట్ కూడా చేశారు. అత్యాచార నిందితులు తెలుసుకునేలా ఓ భయంకర గుణపాఠాన్ని ఈ సినిమా ద్వారా నేర్పబోతున్నామంటూ ఆర్జీవీ తెలిపారు.
 
అంతకుముందు నిర్భయ నిందితుల ఉరిపై ట్వీట్ చేసిన వర్మ.. నాడు క్రూర మృగాల చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురైన నిర్భయ.. ఇవాళ మన సిస్టమ్ చేతిలో అత్యాచారానికి గురవుతోందని వ్యాఖ్యానించారు. నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని ఊహించగలరా మోదీ గారూ అన్న వర్మ.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండంటూ ట్వీట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.