close
Choose your channels

ఇలా జీవించాల్సి వస్తుండటం చాలా బాధాకరం..!

Tuesday, March 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇలా జీవించాల్సి వస్తుండటం చాలా బాధాకరం..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే 140 దేశాలకు పాకినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత్‌కూ పాకడం.. దేశం మొత్తమ్మీద మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. సినిమా షూటింగ్‌లు సైతం వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లియోన్ స్పందించింది.

ఈ మేరకు తన ముగ్గురు పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఓ ట్వీట్ చేసింది. సన్నీ, భర్త డ్యానియెల్, దత్తత పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇదో కొత్త శకం!.. మా పిల్లలు ఇప్పుడు ఇలా జీవించాల్సి వస్తుండడం చాలా బాధాకరం.. కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మాస్కులు ఎలా ధరించాలన్న విషయంపై పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను’ అని సన్నీ లియోన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. కాగా ఇప్పటికే పలువురు నటీనటులు, దర్శకులు తగు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు, వీడియోలో చేసి షేర్ చేసిన విషయం విదితమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.