close
Choose your channels

కొత్త దర్శకుడితో తేజ్

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త దర్శకుడితో తేజ్

యువ కథానాయకుడు.. మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ స్పీడు పెంచుతున్నాడు. `చిత్రలహరి` సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజు పండగే` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే తదుపరి సినిమాకు సాయితేజ్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం సాయితేజ్ తన తదుపరి చిత్రాన్ని ఓ డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి పనిచేయబోతున్నాడట. ఉయ్యాలా జంపాలా, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన సుబ్బు అనే దర్శకుడితో సాయితేజ్ తదుపరి సినిమా తెరకెక్కనుందని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.