హారర్ చిత్రంలో విమలారామన్...
Send us your feedback to audioarticles@vaarta.com
'నమో వేంకటేశాయ' చిత్రంలో పద్మావతీ దేవిగా నటించిన విమలారామన్. ఇప్పుడు ఓ బై లింగువల్ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆమె భాగాన్ని దర్శకుడు దొరైరాజ్ చిత్రీకరించేశాడట. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి దర్శక నిర్మాతలు విమలారామన్ అయితే పాత్రకు న్యాయం చేస్తుందని భావించి ఆమెను పాత్రకు ఎంచుకున్నారట.
సుందర్.సి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా హారర్ జోనర్లో తెరకెక్కనుంది. సినిమాలో ఎలాంటి ఆత్మలు కానీ.. కామెడీ ట్రాక్ ఉండదట. అయినా కూడా ప్రేక్షకులను భయపెట్టేలా స్క్రీన్ప్లే ఉంటుందని.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. మరి ఈ చిత్రం విమలా రామన్కు ఎలాంటి బ్రేక్నిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.