రవితేజ రిస్క్ తీసుకుంటాడా?


Send us your feedback to audioarticles@vaarta.com


మాస్ మహారాజా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్గా రవితేజ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది. అదేంటంటే రవితేజ త్వరలోనే నిర్మాతగా మారబోతున్నారని. త్వరలోనే బ్యానర్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనే ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాడని మాస్రాజా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో రవితేజ రిస్క్ తీసుకోడని మరికొందరు అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రవితేజ ఏకధాటిగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం క్రాక్ సినిమా చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నాడు రవితేజ. ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ట్రాక్ ఎక్కక ముందే డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలోనూ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. వీటి మధ్యలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలోనూ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. అలాగే మలయాళ రీమేక్లో అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమాలోనూ రవితేజ నటిస్తున్నాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments