close
Choose your channels

దుబ్బాక ఎన్నిక ఫలితం మరింత అప్రమత్తం చేసింది: కేటీఆర్

Tuesday, November 10, 2020 • తెలుగు Comments
KTR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దుబ్బాక ఎన్నిక ఫలితం మరింత అప్రమత్తం చేసింది: కేటీఆర్

దుబ్బాక ఎన్నిక ఫలితం తమను అప్రమత్తం చేసిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్తి రఘునందన్‌రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. దుబ్బాక ఫలితం తేలిన అనంతరం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విజయాలకు పొంగిపోమని.. అపజయాలకు కుంగిపోమని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

అలాగే పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో తాము ఆశించిన ఫలితం రాలేదన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు సాగుతామన్నారు. ప్రజల ఇచ్చిన తీర్పు శిరోధార్యమన్నారు. ఈ తీర్పును సమీక్షించుకుని మరింత అప్రమత్తంగా ఉంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.