close
Choose your channels

దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ మళ్లీ 'జతగా..' వస్తున్నారు

Saturday, September 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా, రేణి గుంట, మహేష్, డా. సలీమ్... ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే.. అవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించే నిర్మాతగా సురేష్ కొండేటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన 'ఉస్తాద్ హోటల్' అనే చిత్రాన్ని తెలుగులోకి విడుదల చేయబోతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - " 'ఉస్తాద్ హోటల్' చిత్రంలో దుల్కర్, నిత్యా జోడీ బాగుందని ప్రేక్షకులు కితాబులిచ్చారు. ఇద్దరి మధ్య కెమిస్ర్టీ బాగా కుదిరింది. ఇటీవల విడుదలైన 'ఓకే బంగారం'లో ఈ జంట చేసిన మేజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు గెల్చుకుంది. 'బెస్ట్ పాపులర్ మూవీ', 'బెస్ట్ డైలాగ్స్', నటుడు తిలకన్ కి ప్రత్యేక అవార్డు లభించాయి. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న చిత్రం ఇది. భారీ వసూళ్లు సాధించి, మంచి కమర్షియల్ మూవీ అనిపించుకుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ఇది.

సంభాషణలు ప్రత్యేక హైలైట్

ఇది చాలా అర్థవంతమైన చిత్రం. సాహితి రాసిన సంభాషణలు హైలైట్ గా నిలుస్తాయి. మా సంస్థలో వచ్చిన 'జర్నీ', 'పిజ్జా', 'డా. సలీమ్' చిత్రాలకు ఆయన మంచి సంభాషణలు అందించారు. ఇప్పుడు 'జతగా...'కి కూడా అద్భుతమైన మాటలు రాశారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక, గోపీసుందర్ స్వరపరచిన పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇదొక మంచి మ్యూజికల్ మూవీ. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.