close
Choose your channels

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

Thursday, February 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

యూపీ ఎన్నికల ప్రచారంలో వున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది.

దుండుగులు ఆయనపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. మీరట్‌‌లో ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు ఒవైసీ అసదుద్దీన్‌. యూపీ ఎన్నికల్లో పలు స్థానాల్లో పోటీ చేస్తోంది మజ్లీస్ పార్టీ.

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేస్తున్నారు ఒవైసీ . ప్రధానంగా  ఎస్పీ, బీజేపీలను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.