close
Choose your channels

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

Friday, February 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఐదుగురు నిర్మాతలు రూ.54.51 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇప్పటికే పవన్ తన వంతుగా అయోధ్య ఆలయ నిర్మాణానికి రూ.30 లక్షల విరాళాన్ని తిరుపతిలో అందజేసిన విషయం తెలిసిందే. దీనిని స్ఫూర్తిగా తీసుకుని సదరు నిర్మాతలు అయోధ్య రామ మందిర నిర్మాణానికి తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

పవన్ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం

‘‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో చిత్రాలు నిర్మిస్తున్న ఐదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం చేశారు. ఎ.ఎం.రత్నం(మెగా సూర్య ప్రొడక్షన్స్), శ్రీ ఎస్. రాధాకృష్ణ(చినబాబు), దిల్ రాజు(శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), నవీన్ ఎర్నేని(మైత్రి మూవీ మేకర్స్), బండ్ల గణేష్(పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్) కలిసి రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం కోసం ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో తిరుపతిలో అందించిన విషయం తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే నిర్మాతలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ గారి చేతుల మీదుగా నిర్మాతలు ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ గారికి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాష్, నిర్మాత ఎ.దయాకర్‌రావు పాల్గొన్నారు’’ అని ప్రకటనలో జనసేన పేర్కొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.