close
Choose your channels

అదంతా ఫేక్.. ఈ ఫుడ్ తింటే కరోనా ఖతం: కేసీఆర్

Friday, March 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అదంతా ఫేక్.. ఈ ఫుడ్ తింటే కరోనా ఖతం: కేసీఆర్

కరోనా వైరస్ భయంతో ప్రజలు అందరూ అల్లాడుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ప్రజల్లో నెలకొన్న కొన్ని కొన్ని సందేహాలను నివృత్తి చేశారు. ‘చికెన్ తింటే కరోనా వస్తుందని ఈ మధ్య కొందరు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి చికెన్ తింటే కరోనా తగ్గుతుంది. చికెన్ అనేది ప్రొటీన్. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. చికెన్, గుడ్లతో పాటు నిమ్మ, బత్తాయి, కమలా పండ్లు తినాలి. ఈ పండ్లలో విటమిన్ సీ ఉంటుంది’ అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అంతా ఆగమాగం చేయవద్దు!

‘పశుగ్రాసం, పాలు, నిత్యావసర వాహనాలు తిరగాలి. డైరీ పామ్ ఓనర్‌లు మీకు ఎవరు సప్లై చేశారో వారితో మీరు సంప్రదించి తెప్పించుకోవచ్చు. పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా రావాలి కాబట్టి రానివ్వాలి. చికెన్ తింటే వైరస్ వస్తుంది.. అని కొంత మంది దుర్మార్గులు ప్రచారం చేశారు. కానీ చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పండ్ల వాహనాలకు ప్రత్యేక పాస్‌లు ఇవ్వాలి వాటిని అన్నింటిని కూడా హైదరాబాద్‌కు తెప్పించాలి. గుడ్లు కూడా తినాలి.. ఆ వాహనాలను కూడా అనుమతి ఇవ్వాలి. 50 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది. పంట కోత జరగాలి.. హార్వెస్టార్ అందుబాటులో ఉన్నాయి. పంట అమ్ముకోవాలి ప్రపంచ మొత్తం యుద్ధంలో ఉంది. ఎప్పుడైనా చూశామా ఓల్డ్ సిటీలో తప్ప ఎక్కడైనా కర్ఫ్యూ..?. రైతులకు దయచేసి విజ్ఞప్తి.. నాది ముందు నిది ముందుకాదు ఒక్కరి తరువాత ఒక్కరు కొనుకోవచ్చు. ఐకేపీ కేంద్రాలు పెట్టరు. వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారు. మీరు అంతా ఆగమాగం చేయవద్దు. పంట కొనేందుకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోంది’ అని కేసీఆర్ తెలిపారు.

మీ డబ్బులు ఎక్కడికీ పోవు!

‘మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వం కొంటుంది మీకు చెక్‌లు ఇస్తాం మీరు వచ్చేవారు బ్యాంక్ ఖాతాలు తేవాలి. మీ డబ్బులు ఎటుపోవు, కొంత అటు ఇటు మీ ఖాతాలో పడతాయి. మీ ధాన్యం గోదాం లలో పెడుతాం,అవ్వి కూడా సరిపోకపోతే ప్రభుత్వ స్కూల్‌లలో పెడతాం. ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగొలు చేస్తాం. ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుకోవచ్చు కానీ మద్దతు ధర ఇవ్వాలి. ఊర్లలో వేసిన కంచెలను కూడా తొలగించాలి. ఎందుకంటే మీ ఊరు పంటలు కొనాలంటే లారీలు రావాలి. ఇంకా ఇతర రవాణా సరుకులు కూడా రావాలి’ అని అధికారులు, పోలీసులను కేసీఆర్ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.