close
Choose your channels

కృష్ణవంశీ షురూ చేశాడు...

Monday, November 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కృష్ణవంశీ షురూ చేశాడు...

విలక్షణ దర్శకుడిగా పేరున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తన కొత్త సినిమా ‘రంగమార్తాండ’ను షురూ చేశాడు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌'కు ఇది రీమేక్‌. ఈ సినిమా అధికారికంగా చిత్రీకరణను ప్రారంభించింది. కృష్ణవంశీ స్నేహితుడు ప్రకాశ్‌రాజ్‌, కృష్ణ వంశీ సతీమణి, ప్రముఖ సీనియర్‌ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. కాగా.. సీనియర్‌స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం ఇందులో హృదయాన్ని పిండేసే ఓ పాత్రలో నటించబోతున్నాడు.

ఆయనకు సంబంధించిన లుక కూడా విడుదలైంది. ‘రంగస్థలం’లో రంగమత్తగా మెప్పించిన అనసూయ భరద్వాజ్‌ ఇందులో కీలక పాత్రలో నటించనుంది. మిగిలిన వారి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు దర్శకుడు తేజ గౌరవ దర్శకత్వం వహించాడు. అంతఃపురం తర్వాత కృష్ణవంశీ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. అభిషేక్‌, మధు కలిపు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సినిమా ఎక్కువ భాగం వైజాగ్‌లో చిత్రీకరణను జరుపుకోనుంది.

2016లో సాయిధరమ్‌తేజ్‌తో కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఆ సినిమా అనుకున్న మేర విజయాన్ని సాధించలేదు. దాంతో కృష్ణవంశీని ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈయన మరో సినిమాను ట్రాక్‌ ఎక్కిస్తుండటం విశేషం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. మరి ఈ సినిమాతో అయినా మన క్రియేటివ్‌ డైరెక్టర్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడో లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.