close
Choose your channels

జనసేన వీడటంపై లక్ష్మీ నారాయణ క్లారిటీ

Saturday, August 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన వీడటంపై లక్ష్మీ నారాయణ క్లారిటీ

జనసేన కీలకనేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లక్ష్మీ నారాయణతో పాటు ఆయన అనుచరులు, కేడర్ మొత్తం జనసేనకు టాటా చెప్పేస్తారని వార్తలు వచ్చాయి. ఈయన పార్టీని వీడితే జనసేన ఎదురుదెబ్బ తగిలినట్లవుతుందని.. పార్టీకి చెందిన నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో మాజీ జేడీ సోషల్ మీడియా వేదికగా పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేశారు.

ఇడియట్స్ మాత్రమే..!

"నేను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోయాను. నేనంటే పట్టని వాళ్లు కొందరు నాపై ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. ఆ పుకార్లను మూర్ఖులు ప్రచారం చేస్తున్నారని.. అయితే వీటిని ఇడియట్స్ మాత్రమే అంగీకరిస్తారు. ఈ వార్తలను నమ్మేవారు ఏ కేటగిరికి చెందిన వారే మీరే నిర్ణయించుకోండి. నా అవసరం పార్టీకి ఉంటుందని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భావించే వరకూ నేను జనసేనలోనే ఉంటాను. పుకార్లను పుట్టించడం మాని.. సేవా కార్యక్రమాలు ప్రారంభించిండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించడం, మొక్కలు నాటడం, యువతను చైతన్యపరచడం లాంటి కార్యక్రమాలపై దృష్టి పెడితే బాగుంటుందని భావిస్తున్నాను" అని జైహింద్ చెబుతూ లక్ష్మీ నారాయణ ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. అయితే ఇకనైనా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడతాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.