'సుప్రీమ్' కాంబో తో మారుతి
Send us your feedback to audioarticles@vaarta.com
మారుతి దర్శకత్వంలో సాయిధరమ్తేజ్ హీరోగా నటించబోయే సినిమా కోసం రోజుకొక పేరు వినిపిస్తోంది. తాజాగా ఆ స్థానాన్ని రాశీఖన్నా భర్తీ చేసింది. అయితే ఇకపై ఇంకెవరి పేరూ వినిపించదని, రాశీ పేరును ఫిక్స్ చేసేస్తున్నారనీ సమాచారం. సాయి తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నెల 27 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. నిన్నమొన్నటిదాకా నాయిక స్థానంలో నిధి అగర్వాల్ పేరు వినిపించింది.
అయితే ఈ అమ్మడి ఖాతాలో ఒక్క హిట్టు కూడా లేకపోవడం, న్యూమరాలజీని బాగా నమ్మే మారుతిని ఆలోచనలో పడేసినట్టుంది. అందుకే గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న రాశీని ఫిక్స్ చేశారు. రాశీ, సాయి కాంబోలో ఇది తొలి సినిమా ఏమీ కాదు. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి సుప్రీమ్ చేశారు. అందులో బెల్లంశ్రీదేవిగా రాశీ నవ్వులు పండించారు. ఈ సినిమాలో మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఏదైమైనా రాశీ కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర బెల్లం శ్రీదేవి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.