close
Choose your channels

హీరో గోపీచంద్ చేతులమీదుగా 'మెంటల్' ఆడియో ఆవిష్కరణ

Sunday, August 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీకాంత్, అక్ష హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లలో సంయుక్త నిర్మాణంలో కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా మెంటల్`. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో హీరో గోపీచంద్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

ఈ సందర్బంగా హీరో గోపి చాంద్ మాట్లాడుతూ " శ్రీకాంత్ అన్న కమిట్మెంట్ ఉన్న హీరో కాబట్టి వంద సినిమాలు పూర్తి చేసాడు. అది మాకు సాధ్యం కాదు. ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. సంగీత దర్శకుడు సాయి కార్తిక్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అతను ఈ చిత్రానికి కూడా మంచి సంగీతాన్ని అందించి ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు తీసుకురావాలి" అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ " దర్శకుడు తీస్తున్న విధానం చూసి కొద్దిగా కంగారు పడ్డాను. ఈ సినిమా మరో 'ఆపరేషన్ దుర్యోధన' అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిమా అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా నా మాట కాదనలేక ఈ సినిమా చేసాడు. మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో తొలుత సినిమా టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ, ఇన్ కం ట్యాక్స్ కమీషనర్ మరియు దర్శకురాలైన వాణి ఎం కొసరాజులు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు దాసరి ప్రసాద్ (ఏలూరు), అనగాని ప్రసాద్, శివాజీ రాజా, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్, శ్రీమిత్ర చౌదరి, జి.వి.లతో బాటు తెలంగాణా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.