close
Choose your channels

నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్‌కు నాగబాబు కుటుంబం...

Monday, December 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈనెల 9న మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహం కోసం దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్‌పూర్  ప్యాలెస్ సిద్ధమవుతోంది. అయితే వివాహ సమయం దగ్గర పడుతుంటడంతో మెగా బ్రదర్ నాగబాబు కుటుంబంతో పాటు, చైతన్య జొన్నలగడ్డ కుటుంబం రాజస్థాన్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా చైతన్య తీసిన పిక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో ఇరు కుటుంబాలు చాలా ఆనందంగా కనిపిస్తున్నాయి.

కాగా.. నిహారిక పెళ్లి సందడి రెండు రోజుల క్రితమే మొదలైంది. నిహారికను పెళ్లి కూతుర్ని చేయడం తదితర వేడుకలన్నింటినీ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక తన తల్లి నిశ్చితార్థ వేడుకలో కట్టుకున్న చీరను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. తన తల్లి పద్మ నిశ్చితార్థానికి సిద్ధమైన ఫోటోను.. అదే చీరలో తను పెళ్లికూతురిగా ముస్తాబైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తీసుకున్న సెల్ఫీని సైతం నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నిహారిక పెళ్లి వేడుకకు సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం వరుణ్ తేజ్ పర్యవేక్షిస్తున్నాడు. టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ డెస్టినేషన్ వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు మెగా హీరోలంతా హాజరై సందడి చేయనున్నారు. ఇప్పటికే మెగా డాటర్స్‌తో నిహారిక తీసుకున్న పిక్స్.. మెగా బ్రదర్స్ అంతా కలిసి తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.