close
Choose your channels

నివేదాకు కరోనా.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీం

Sunday, April 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నివేదాకు కరోనా.. టెన్షన్‌లో ‘వకీల్ సాబ్’ టీం

కరోనా మహమ్మారి గత ఏడాది మార్చి నుంచి ప్రజానీకాన్ని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టింది. లాక్‌డౌన్.. సినిమాల విషయానికి వస్తే.. షూటింగ్‌లు ఆగిపోవడం.. థియేటర్ల మూసివేత.. అన్నీ వెరసి ఇండస్ట్రీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి జనాలు కాస్త ఊపిరి తీసుకుంటూ వచ్చారు. షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. క్రమక్రమంలో థియేటర్లు సైతం తెరుచుకున్నాయి. అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో ఈ మహమ్మారి మరోసారి విజృంభించింది. ఈ ఏడాది కూడా తిరిగి మార్చిలోనే సెకండ్ వేవ్ ప్రారంభమైంది.

దీంతో పలువురు సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ‘వకీల్ సాబ్’నటి నివేదా థామస్ కరోనా బారిన పడ్డారు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవడంతో టీం కొంచెం ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూల్లో నివేదాతో పాటు దర్శకుడు వేణు శ్రీరామ్‌, అంజలి, థమన్‌, అనన్య నాగళ్ల కలిసి పాల్గొన్నారు. అంతేకాకుండా వేణు శ్రీరామ్ తాజాగా తన సినిమాలో చేసిన ముగ్గురు నటీమణులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ప్రస్తుతం వీరిలో టెన్షన్ మొదలైంది. తనకు కరోనా సోకిన విషయాన్ని నివేదా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ''నాకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వైద్యుల సలహాలను పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వస్తాను. నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్‌ టీమ్‌కు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, క్షేమంగా ఉండండి.." అని నివేదా తన ట్వీట్‌లో పేర్కొంది. నివేదాతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా కరోనా బారిన పడ్డారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.