close
Choose your channels

kantamaneni uma maheswari : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం.. శోకసంద్రంలో అన్నగారి ఫ్యామిలీ

Monday, August 1, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్- బసవ తారకం దంపతులకు ఆమె నాలుగో కుమార్తె. అయితే ఉమా మహేశ్వరి మరణానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.

నాలుగేళ్ల క్రితం హరికృష్ణ దుర్మరణం:

2018 ఆగస్ట్ 29న ఎన్టీఆర్ కుమారుడు , మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి అన్నగారి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఉమామహేశ్వరి కన్నుమూయడంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మరణవార్త తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌లు ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లారు. అటు విదేశాల్లో వున్న మరికొందరు కుటుంబ సభ్యులు కూడా భారత్‌కు రానున్నారు.

మొన్ననే కూతురి పెళ్లి .. అంతలోనే ఇలా:

కొద్దిరోజుల క్రితమే ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అల్లుల్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దాదాపు పాతికేళ్ల నుంచి నారా- దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజకీయ వైరం వుంది. ఎన్టీఆర్‌ను గద్దెను దించిన తర్వాతి నుంచి వీరిద్దరూ ఎదురుపడి మాట్లాడింది లేదు. చంద్రబాబుపై పుస్తకాల రూపంలో తన అక్కసు తీర్చుకునేవారు దగ్గుబాటి. అలాంటి మళ్లీ తోడల్లుళ్లిద్దరూ ఒకే వేదికపైకి రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు , టీడీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దగ్గుబాటికి గుండెపోటు రావడంతో అపోలోకి వెళ్లి పరామర్శించారు చంద్రబాబు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.