close
Choose your channels

పలాస దర్శకుడి వెబ్ సిరీస్..!

Saturday, June 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పలాస దర్శకుడి వెబ్ సిరీస్..!

తొలి చిత్రం ‘ప‌లాస 1978’ సినిమాతో అటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు క‌రుణ కుమార్‌. ఈ సినిమా సక్సెస్‌తో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి ఓకే చేయించేసుకున్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు క‌రుణ కుమార్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రాజశేఖర్‌తో చేయ‌బోతున్నాడ‌నే వార్త‌లు వినిపించాయి. అయితే అలాంటివేమీ లేద‌ని ద‌ర్శ‌కుడు రీసెంట్‌గా ఓ ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ప్ర‌స్తుతం ఆయ‌న రైట‌ర్ క‌దిర్‌బాబు ర‌చించిన షార్ట్ స్టోరీస్‌ను ఆధారం చేసుకుని ల‌స్ట్‌స్టోరీస్ త‌రహాలో తెలుగులో ఓ సినిమాను చేయ‌బోతున్నాడు. తెలుగు ఓటీటీ ఆహా కోసం ఈ వెబ్ సిరీస్‌ను క‌రుణ కుమార్ తెర‌కెక్కించ‌నుండ‌టం విశేషం

అలాగే త‌న రెండో చిత్రం గురించి క‌రుణ కుమార్ మాట్లాడుతూ ‘‘అల్లు అర‌వింద్‌గారికి ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే సాయితేజ్, సుధీర్‌బాబుల‌ను క‌లిసి క‌థ‌ల‌ను వినిపించాను. అలాగే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ వారికి కూడా క‌థ చెప్పాను. మ‌రికొంత మంది నిర్మాత‌లు న‌న్ను క‌లిశారు. ఎవ‌రితో రెండో సినిమా చేస్తానో ఇప్పుడే చెప్ప‌లేను’’ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.